
తెలంగాణ పీజీ ఈసెట్ 2026 అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు
తెలంగాణ పీజీ ఈసెట్-2026 అడ్మిషన్ల కౌన్సెలింగ్లో భాగంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల అప్లోడ్ గడువును జులై 16 వరకు పొడిగించినట్లు తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలు కోరుకునే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది. కౌన్సెలింగ్ పూర్తిగా ఆన్లైన్లో నిర్వహించబడుతుందని, గడువులోపు సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసిన వారికి మాత్రమే వెబ్ ఆప్షన్లు నమోదు, సీట్ల కేటాయింపు ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు.




