National
ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్…

ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్
ఆగస్టు 1 నుంచి దేశవ్యాప్తంగా పలు కీలక నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఎల్పీజీ సిలిండర్ ధరలను చమురు సంస్థలు సవరించే అవకాశం ఉండగా, బ్యాంకింగ్లో ‘సెంట్రల్ కేవైసీ 2.0’ వ్యవస్థ ప్రారంభం కానుంది. దీంతో ఒకే కేవైసీతో పలు ఆర్థిక సేవలు పొందే వీలుంటుందని రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ టోకెన్ విధానంలో మార్పులు అమలులోకి రానున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ డెబిట్ కార్డు, పీఎన్బీ సి,ఎం,ఎస్–ఎన్,ఎ,సి,హేచ్ సేవల ఛార్జీల్లో మార్పులు, సెబీ షేర్ బైబ్యాక్ కొత్త నిబంధనలు కూడా అమల్లోకి రానున్నాయి. మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్కు కొత్త నిబంధనలు, ఢిల్లీలో ఉచిత బస్సు ప్రయాణానికి పింక్ స్మార్ట్ కార్డు తప్పనిసరి కానుందని తెలిపారు.



