Political

రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దాహనం…

ధర్పల్లిలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ నాయకులు

 

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు.

 

బీజేపీ నాయకులు రోడ్డుపై గుమిగూడి రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండిస్తూ నినాదాలు చేశారు. అనంతరం ఆయన దిష్టిబొమ్మకు నిప్పు పెట్టారు.

కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు దేశ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని బీజేపీ నాయకులు ఆరోపించారు.

 

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button